Friday, October 18, 2024

Asia Cup | నేపాల్‌తో మ్యాచ్‌, టాస్ గెలిచిన భారత్..

మ‌హిళ‌ల ఆసియా క‌ప్ 2024లో భాగంగా నేడు జరుగుతున్న మ‌రో మ్యాచ్ లో భారత్ – నేపాల్ జట్లు తలపడుతున్నాయి. కాగా, దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత మహిళల జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, ఇప్పిటికే రెండు వ‌రుస విజ‌యాల‌తో భార‌త్ గ్రూపు ఏలో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్న టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది.

తుది జట్లు

భారత్ : షఫాలీ వర్మ, స్మృతి మంధాన (కెప్టెన్), దయాళన్ హేమలత, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, సజన, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్, అరుంధతీ రెడ్డి

నేపాల్ : సంఝనా ఖడ్కా, సీతా రాణా మగర్, కబితా కున్వర్, ఇందు బర్మా(కెప్టెన్), డాలీ భట్టా, రుబీనా ఛెత్రీ, పూజ మహతో, కబితా జోషి, కాజల్ శ్రేష్ఠ(వికెట్ కీపర్), సబ్‌నమ్ రాయ్, బిందు రావల్

Advertisement

తాజా వార్తలు

Advertisement