Thursday, September 19, 2024

Test | ఆఫ్గాన్‌తో మ్యాచ్.. భారత్‌కు చేరుకున్న న్యూజిలాండ్‌ !

న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు భారత్‌లో అడుగుపెట్టింది. అయితే వారు టీమిండియాతో కాకుండా ఆఫ్గానిస్తాన్‌ జట్టుతో ఆడేందుకు ఇక్కడికి వచ్చారు. బీసీసీఐ ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి గ్రేటర్‌ నోయిడాలో న్యూజిలాండ్‌- ఆఫ్గానిస్తాన్‌ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

ఈ మ్యాచ్‌ కోసం ఆఫ్గాన్‌ జట్టు ఇప్పటికే నోయిడా చేరుకోగా.. తాజాగా కివీస్‌ జట్టు సైతం భారత గడ్డపై అడుగుపెట్టింది. గురువారం ఉదయం ఢిల్లి విమానశ్రయం చేరుకున్న వీరు అక్కడి నుంచి బస్సులో గ్రేటర్‌ నోయిడాకు వెళ్లారు. శుక్రవారం నుంచి టిమ్‌ సౌథీ సారథ్యంలోని కివీస్‌ జట్టు ప్రాక్టీస్‌ మొదలు పెట్టనుంది.

ఆఫ్గాన్‌ టెస్టుకు న్యూజిలాండ్‌ జట్టు: టిమ్‌ సౌథీ (కెప్టెన్‌), కేన్‌ విలియమ్సన్‌, విల్‌ యంగ్‌, టామ్‌ లాథమ్‌ (వికెట్‌ కీపర్‌), టామ్‌ బ్లండెల్‌ (వికెట్‌ కీపర్‌), మైఖెల్‌ బ్రేస్‌వెల్‌, డెవాస్‌ కాన్వే, మాట్‌ హెన్రీ, డారిల్‌ మిచెల్‌, విల్‌ ఓరూర్క్‌, అజాజ్‌ పటేల్‌, గ్లెస్‌ ఫిలిప్స్‌, రచిన్‌ రవీంద్ర, మిచెల్‌ సాంట్నర్‌, బెన్‌ సియర్స్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement