Tuesday, July 2, 2024

Retirement | కోహ్లీ, రోహిత్‌ల బాటలోనే జడేజా..

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ గెలిచిన కొన్ని గంటల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే, టెస్టులు, వన్డేల్లో కొనసాగుతానని వెల్లడించాడు.

ప్రపంచకప్‌ టైటిల్‌ గెలిచిన వెంటనే విరాట్‌ కోహ్లీ టీ20కి రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. ట్రోఫీని ముద్దాడిన తర్వాత రోహిత్ శర్మ కూడా భారత్ తరఫున టీ20లకు వీడ్కోలు పలికాడు. తాజాగా రవీంద్ర జడేజా సైతం.. టీ20 కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు.

- Advertisement -

భారత్‌ తరఫున 2009న టీ20 క్రికెట్‌లో అడుగుపెట్టిన రవీంద్ర జడేజా.. ఇప్పటివరకు 74 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 515 పరుగులు చేశాడు. 54 వికెట్లు పడగొట్టాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement