వరల్డ్ కప్లో ఇప్పటి వరకు వరుస విజయాలతో భారత్ జైత్రయాత్రను కొనసాగిస్తుంది. ఇవాళ భారత్ ఇంగ్లండ్తో తలపడనుంది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోవడం తప్ప భారత జట్టుకు పెద్దగా సమస్యలేమీ లేకపోగా.. ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్ మాత్రం గాడిన పడేందుకు నానా తంటాలు పడుతుంది. 2019 ప్రపంచకప్ లీగ్ దశలో భారత్ ఓడిన ఏకైక మ్యాచ్ ఇంగ్లండ్ చేతిలోనే కాగా.. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు.
ఈ మ్యాచ్లోనూ గెలిచి సెమీస్కు మరింత చేరువ అవ్వాలని భారత్ యోచిస్తోంది. లక్నో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండానే భారత్ బరిలోకి దిగాలని చూస్తోంది. కాగా.. రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తుదిజట్టులో చోటు దక్కించుకొన్నారు. కాగా మొత్తం 10 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో ఇండియా రెండవ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో గెలిస్తే తిరిగి అగ్రస్థానానికి దూసుకెళ్లనుంది.