Monday, September 16, 2024

Duleep Trophy | ర‌స‌వ‌త్తంగా సీ-డీ మ్యాచ్ !

దులిప్ ట్రోఫీ 2024 టోర్నీలో భాగంగా అనంతపురం వేదికగా ఇండియా సి వర్సెస్ ఇండియా డి మ్యాచ్ ర‌స‌వ‌త్తంగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో ఇండియా డి జట్టు ఇండియా సిపై 202 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ డి.. అక్షర్ పటేల్ (83) అసాధారణ పోరాటంతో తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు ఆలౌటయ్యింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సీ టీమ్ తొలి ఇన్నింగ్స్ లో 168 పరుగులకు కుప్ప‌కూలింది.

దీంతో, ఈ రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా డీ భారీ స్కోర్ సాధించింది. కెప్ట‌న్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (54), దేవదత్ పడిక్కల్ (56) అర్థ శ‌త‌కాల మోత మోగించారు. రికీ భుయ్ (44) రాణించాడు. కాగా, ప్ర‌స్తుతం క్రీజ్ లో అక్ష‌ర్ ప‌టేట్ (11), హర్షిత్ రానా (0) ఉన్నారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(54) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇండియా ఎ బౌల‌ర్ల‌లో మానవ్ సుతార్ 5 వికెట్లు తీయగా, విజయ్ కుమార్ వైశాఖ్ రెండు వికెట్లు, అన్షుల్ కాంబోజ్ ఒక వికెట్ తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement