Saturday, September 14, 2024

IND vs ZIM | రాణించిన సికందర్.. భారత్ టార్గెట్ ఎంతంటే

జింబాబ్వే-భారత్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా.. నేడు జరుగుతున్న కీలక మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. టీమిండియా ముందు ఓ మోస్తరు టార్గెట్‌ను సెట్ చేసింది. కెప్టెన్ సికందర్ రజా (46), తాడివానాషే మారుమణి (32), వెస్లీ మాధవెరె (25) పరుగులతో రాణించారు.

దీంతో జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. తుషార్ దేశ్‌పాండే, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, శివమ్ దూబేలకు తలో వికెట్ దక్కింది.

ఇక 2-1 సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న టీమిండియా… ఈ మ్యాచ్‌లోనే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. దీంతో సిరీసే లక్ష్యంగా 154 పరుగుల టార్గెట్‌తో భారత జట్టు చేజింగ్‌కు దిగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement