Sunday, June 30, 2024

IND vs SA | ఆదుకున్న లారా, త‌జ్మిన్.. భారత్ టార్గెట్ ఎంతంటే

ద‌క్షినాఫ్రికాతో జ‌రుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా మహిళలు అద‌ర‌గొడుతున్నారు. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచుల్లో గెలుపొంది.. 2–0తో సిరీస్ కైవసం చేసుకుంది. కాగా, నేడు జరుగుతున్న మూడో మ్యాచ్‌లోనూ భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు సత్తాచాటుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ద‌క్షిణాఫ్రికాను స్వ‌ల్ప స్కోర్‌కే క‌ట్ట‌డి చేసింది.

ఓపెన‌ర్లు లారా వొల్వార్డ్త్ (61), త‌జ్మిన్ బ్రిట్స్‌(38)లు రాణించారు. ఇక ఆఖర్లో న‌డినె డె క్లెర్క్(26), మైకీ డి రిడ్డ‌ర్‌ (26)తో పోరాడారు. దీంతో నిర్ణీత ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 215 ర‌న్స్ కొట్టింది సౌతాఫ్రికా జట్టు. దీప్తి శ‌ర్మ‌(2/27), అరుంధ‌తి రెడ్డి(2/36)ల విజృంభ‌ణ‌తో పర్యాట‌క జ‌ట్టు బ్యాట‌ర్లు చేతులెత్తేశారు.

కాగా, ప్రస్తుతం సౌతాఫ్రికా నిర్ధేశించిన 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. 8 ఓవర్లు ముగిసే సరికి 48 పురుగుల సాధించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (26నాటౌట్), షఫాలీ వర్మ (18 నాటౌట్) ఆడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement