Monday, October 21, 2024

CK Nayudu Under-23 | హర్ష, రేవంత్ శతకాల మోత..

ఇబ్రహీంపట్నం, (ఆంధ్రప్రభ) : ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రా – మేఘాలయ జట్ల మధ్య సీకే నాయుడు అండర్ – 23 పురుషుల క్రికెట్ మ్యాచ్ ఆదివారం ప్రారంభమైంది. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు గోకరాజు లైలా గంగరాజు క్రికెట్ స్టేడియంలోని డీవీఆర్ గ్రౌండ్ లో జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో… టాస్ గెలిచిన మేఘాలయ జట్టు ఫీల్డింగ్ ను ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన ఆంధ్రా జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 62 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 372 పరుగులు చేసింది.

కాగా ఈ మ్యాచ్ లో కె.రేవంత్ రెడ్డి (158 బంతుల్లో 19 ఫోర్లు, 5×సిక్స్ లు *186 పరుగులు), హర్షవర్ధన్ (187 బంతుల్లో 10ఫోర్లు, 7×సిక్స్ లు *149 పరుగులు) సెంచరీలతో రెచ్చిపోయారు. వీరిద్ద‌రు కిల‌సి 324 బంతుల్లో 303 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక‌ సుబ్రహ్మణ్యం (27 బంతుల్లో 2ఫోర్లు *26) పరుగులు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement