భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్…. శిఖర్ ధావన్ బాటలోనే నడవనున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన డీకే…. రానున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్లో పాల్గొంటున్నట్లు ప్రకటించాడు. ఇక ఇటీవల శిఖర్ ధావన్ కూడా అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిగా… ఆ నిర్ణయం తీసుకున్న రెండురోజులకే లెజెండ్స్ లీగ్ లో ఆడనున్నట్టు ప్రకటించాడు.
ఇక, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ విషయానికి వస్తే.. లెజెండ్స్ లీగ్లో ఆడేందుకు కార్తీక్ ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు. క్రికెట్ ఆడేందుకు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. నిరంతరం సపోర్ట్ చేస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ, మళ్లీ వారిని అలరించడానికి తాను ఎదురు చూస్తున్నానని చెప్పాడు.
కాగా, లెజెండ్స్ లీగ్లో దినేష్ కార్తీక్ @సదరన్ సూపర్ స్టార్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తాడు. అంతేకాకుండా.. అంతర్జాతీయ, భారత క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత అనేక T20 లీగ్లలో ఆడటం ప్రారంభించిన డీకే, దక్షిణాఫ్రికా గడ్డపై SA20 లో పాల్గొన్న మొదటి భారతీయ క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు.
ఇక భారత్ తరుఫున అన్ని ఫార్మాట్లలో ఆడిన దనేష్, తన కెరీర్ చివరిలో తనను తాను బెస్ట్ వికెట్ కీపర్ & ఫినిషర్గా తీర్చిదిద్దుకున్నాడు. తన గత ఐపీఎల్ సీజన్లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆ పాత్రలో అద్భుతంగా రాణించాడు. ఇక తర్వాతి సీజన్లో RCBకి బ్యాటింగ్ కోచ్, మెంటార్గా కనిపించనున్నాడు.