Sunday, July 7, 2024

Congratulations – మోడీతో టీమ్ ఇండియా.. జ‌ట్టు స‌భ్యుల‌కు ప్రధాని అల్పాహార‌ విందు

విశ్వ విజేత‌ల‌కు ప్ర‌ధాని ప్ర‌త్యేక అభినంద‌న‌లు
ప్ర‌తిఒక్క ప్లేయ‌ర్ ను పేరు పేరునా ప‌ల‌క‌రింత‌
కోచ్ రాహుల్ ద్రవిడ్ తో మాటా మంతి
కొత్త జెర్సీతో మోదీ వ‌ద్దకు జ‌ట్టు

వెస్టిండీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్‌ 2024 విజేతగా నిలిచిన భారత జట్టు నేడు స్వదేశానికి చేరింది. అనంత‌రం ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీని భారత ప్లేయర్స్ కలుసుకున్నారు. విశ్వవేదికపై భారత్‌ను విజేతగా నిలిపిన రోహిత్ సేనను ప్రధాని అభినందించారు. ప్రధానితో కలిసి ప్లేయర్స్ అందరూ అల్ఫాహారం చేశారు.. పత్రి ఒక్క ప్లేయర్ ను మోదీ పేరుపేరేనా పలకరించారు..కోచ్ రాహుల్ తో టోర్నివిశేషాలను అడిగి తెలుసుకున్నారు.

అయితే మోడీని కలవడానికి భారత ఆటగాళ్లు స్పెషల్ జెర్సీలో వెళ్లారు. టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగిన జెర్సీ తరహాలోనే ఈ స్పెషల్ జెర్సీ ఉండగా.. స్వల్ప మార్పులు చేశారు. జెర్సీ ముందు భాగంలో ‘ఇండియా’ కింద ‘ఛాంపియన్స్’ అని అదనంగా ముద్రించారు. టీ20 ప్రపంచకప్‌ 2024 గెలిచినందుకు ఛాంపియన్స్ అని జెర్సీపై ఆడ్ చేశారు.

- Advertisement -

అలాగే ఎడమవైపు ఉండే బీసీసీఐ లోగోపై రెండు స్టార్లను ముద్రించారు. గతంలో ఒక్క స్టార్ మాత్రమే ఉండేది. 2007 టీ20 ప్రపంచకప్‌ విజయానికి గుర్తుగా ఆ స్టార్ ఉండేది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌ 2024 గెలవడంతో రెండు స్టార్లుగా ఛేంజ్ చేశారు. ఈ రెండు మినహా టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగిన జెర్సీలో మరే మార్పు లేదు. కొత్త జెర్సీకి సంబందించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement