Thursday, September 19, 2024

HCA | బుచ్చిబాబు విజేత హైదరాబాద్‌కు భారీ ప్రైజ్‌మనీ !

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ క్రికెట్‌ జట్టుకు హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శినపల్లి జగన్‌మోహన్‌ రావు భారీ నగదు బహుమతి ప్రకటించారు. ఇటీవల తమిళనాడులో జరిగిన ఆల్‌ ఇండియా బుచ్చిబాబు ఇన్విటేషన్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ చాంపియన్‌గా అవతరించింది.

గత రంజీ సీజన్‌లో ప్లేట్‌ డివిజన్‌లో అజేయ విజేతగా నిలిచిన హైదరాబాద్‌.. బుచ్చిబాబు టోర్నమెంట్‌లోనూ మేటి జట్లను చిత్తు చేసింది. గత సీజన్‌ నుంచి ఇప్పటివరకు అజేయ రికార్డును కొనసాగించింది. దీంతో సీనియర్‌ మెన్స్‌ జట్టుకు రూ. 25 లక్షల నగదు బహుమతి అందజేస్తున్నట్టు జగన్‌మోహన్‌ రావు ప్రకటించారు.

‘సుదీర్ఘ విరామం అనంతరం హైదరాబాద్‌ జట్టు బుచ్చిబాబు టోర్నమెంట్‌లో విజేతగా నిలవటం సంతోషంగా ఉందన్నారు. గత సీజన్‌లో రంజీ ప్లేట్‌ చాంపియన్‌గా నిలిచాం. ఈ సీజన్‌లో రంజీ ఎలైట్‌ చాంపియన్‌గా నిలువాలనేది నా లక్ష్యం. క్రికెటర్లకు, సహాయక సిబ్బందికి అవసరైన సహాయ సహకారాలు హెచ్‌సీఏ అందించేందుకు సిద్దంగా ఉంది’ అని జగన్‌మోహన్‌ అన్నారు.

బుచ్చిబాబు ట్రోఫీతో హైదరాబాద్‌కు చేరుకున్న హైదరాబాద్‌ టీమ్‌, కోచ్‌ చటర్జీను శుక్రవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు ఘనంగా సత్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement