Tuesday, October 29, 2024

AUS vs PAK | పాక్‌ సిరీస్‌కు ఆసీస్‌ జట్టు ప్రకటన..

వచ్చే నెలలో స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌ కోసం ఆసీస్‌ క్రికెట్‌ బోర్డు 13 మందితో కూడిన జట్టును సోమవారం ప్రకటిచింది. అయితే జట్టుకు కెప్టెన్‌ ఎవరో ఇంకా వెల్లడించలేదు. కాగా, గాయాల కారణంగా గత కొద్ది కాలంగా జట్టుకు దూరంగా ఉన్న స్పెన్సర్‌ జాన్సన్‌, నాథన్‌ ఎల్లిస్‌, జేవియర్‌ బార్ట్‌లెట్‌ మళ్లి ఆసీస్‌ టీమ్‌కు ఎంపికయ్యారు.

మరోవైపు భారత్‌తో జరగనున్న బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ దృష్ట్యా ప్రముఖ టెస్టు ప్లేయర్లను పాక్‌ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. టీ20 రెగ్యూలర్‌ సారథి మిఛెల్‌ మార్ష్‌ కూడా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ మధ్య జరిగే ఈ మూడు మ్యాచ్‌ పొట్టి సిరీస్‌ నవంబర్‌ 14 నుంచి ప్రారంభం కానుంది. నవంబర్‌ 16న రెండోవ, 18న మూడోవ టీ20 జరగనుంది. మరోవైపు ఈ సిరీస్‌ కోసం పాక్‌ క్రికెట్‌ బోర్డు ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. తమ జట్టుకు తొలిసారి రిజ్వాన్‌ను కెప్టెన్‌గా నియమించింది.

ఆస్ట్రేలియా జట్టు :

- Advertisement -

సీన్‌ అబాట్‌, జేవియర్‌ బార్ట్‌లెట్‌, కూపర్‌ కొన్నోలీ, టిమ్‌ డేవిడ్‌, నాథన్‌ ఎల్లిస్‌, జేక్‌ ఫ్రేజర్‌-మెక్‌గర్క్‌, ఆరోన్‌ హార్డి, జోష్‌ ఇంగ్లిస్‌, స్పెన్సర్‌ జాన్సన్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మాథ్యూ షార్ట్‌, మార్కస్‌ స్టోయినిస్‌, ఆడమ్‌ జంపా.

Advertisement

తాజా వార్తలు

Advertisement