Thursday, October 17, 2024

Asia Cup | దంచికొట్టిన షఫాలీ… నేపాల్ ముందు భారీ టార్గెట్

నేపాల్‌తో జరుగుతున్న లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు దంచి కొట్టింది. నేపాల్ బౌల‌ర్ల‌ను ఉతికారేస్తూ… నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 178 పరుగులు బాదింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నేపాల్ జట్టుపై విజృంభించింది.

ఓపెనర్ షఫాలీ వర్మ (81) తో హాప్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టగా… ఆమెకు తోడుగా మ‌రోవైపు దయాళన్ హేమలత (42) రాణించింది. ఇక ఆఖ‌ర్లో జెమిమా రోడ్రిగ్స్ మెరుపు ఇన్నింగ్స్ తో (28 నాటౌట్) ప‌రుగులు సాధించింది. దీంతో నేపాల్ ముందు 179 ప‌రుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది భారత జట్టు.

Advertisement

తాజా వార్తలు

Advertisement