Saturday, June 29, 2024

AP: క్రీడాకారిణి జెస్సీరాజ్‌కు మంత్రి లోకేశ్‌ ప్రశంసలు…

విజయవాడకు చెందిన క్రీడాకారిణి మాత్రపు జెస్సీరాజ్‌కు మంత్రి నారా లోకేశ్‌ అభినందనలు తెలిపారు. ఆమె ఇటీవల న్యూజిలాండ్‌లో జరిగిన ప్రపంచ ఓషియానిక్‌ రోలర్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు.


ఇన్ స్కేటింగ్ విభాగంలో ఆమె బంగారు పతకాన్ని సాధించారు. జెస్సీరాజ్‌ అంతర్జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడంపై లోకేశ్‌ హర్షం వ్యక్తం చేశారు. విజయవాడకు చెందిన బాలిక ప్రపంచస్థాయిలో భారత్ కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింపజేయడం గర్వంగా ఉందన్నారు. ప్రతిభ గల క్రీడాకారిణులకు తమ ప్రభుత్వం అన్నివిధాలా సహాయ, సహకారాలను అందించి ప్రోత్సహిస్తుందని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement