Tuesday, October 22, 2024

CK Nayudu Under-23 | మేఘాలయపై ఆంధ్రా విజయం..

ఇబ్రహీంపట్నం, (ఆంధ్రప్రభ) : మూలపాడు గోకరాజు గంగరాజు లైలా గంగరాజు క్రికెట్ స్టేడియంలోని డీవీఆర్ గ్రౌండ్ లో ఆంధ్రా – మేఘాలయ జట్ల మధ్య జరిగిన సీకే నాయుడు అండర్ – 23 పురుషుల క్రికెట్ మ్యాచ్ లో 93 పరుగుల తేడాతో ఆంధ్రా జట్టు విజయం సాధించింది.

ఆంధ్రా జట్టు తొలి ఇన్నింగ్స్ లో 62 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. రెండో రోజు 66.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 402 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. మేఘాలయ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 66.4 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌట్ అయింది.

ఆంధ్రా బౌలర్లు 54 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు, ఇస్మాయిల్ 55 పరుగులకు రెండు వికెట్లు తీసుకున్నారు. రెండో ఇన్నింగ్స్ లో మేఘాలయ 64.4 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయింది. కెవిన్ 102 బంతుల్లో (5×4), (2×6) 51 పరుగులు చేశాడు. ఆంధ్రా బౌలర్ ఇస్మాయిల్ 37 పరుగులిచ్చి ఎనిమిది వికెట్లు తీసుకున్నాడు. శ్రీకర్ 23 పరుగులు, సాకేత్ రామ్ 32 పరుగులిచ్చి చెరో ఒక వికెట్ తీసుకున్నారు. 93 పరుగులతో ఆంధ్రా విజయం సాధించింది. ఆంధ్రాకు 16 పాయింట్లు, మేఘాలయకు రెండు పాయింట్లు లభించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement