ప్రయాణికులకు షాక్
మొంథా తుఫాన్ ప్రభావంతో రవాణా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేయగా.. ఇప్పుడు విమాన సర్వీసులపై కూడా ప్రభావం పడింది.
ఎయిర్ ఇండియా, ఇండిగో విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
రద్దయిన విమానాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
- IX 2819: విశాఖపట్నం–విజయవాడ
- IX 2862: విజయవాడ–హైదరాబాద్
- IX 2875: విజయవాడ–బెంగళూరు
- IX 976: షార్జా–విజయవాడ
- IX 975: విజయవాడ–షార్జా
- IX 2743: హైదరాబాద్–విజయవాడ
- IX 2743: విజయవాడ–విశాఖపట్నం
తుఫాను తీవ్రత తగ్గే వరకు విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం లేదని అధికారులు తెలిపారు.

