cricket | నాలుగో వికెట్ కోల్పోయిన స‌ఫారీ

cricket | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : కోల్​కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో సఫారీ కెప్టెన్ టెంబా బవుమా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ బౌల‌ర్లు బుమ్రా, కుల్దీప్ రెచ్చిపోతున్నారు. చెరో రెండు వికెట్లు తీసి సౌతాఫ్రికా జ‌ట్టు టాప్ లేపారు. 71 రన్స్‌కే 3 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా టాపార్డర్‌ను కుప్పకూల్చారు. లంచ్ త‌ర్వాత నాలుగో వికెట్ కూడా కోల్పోయింది. నాలుగో వికెట్‌గా ముల్డ‌ర్ 24 ప‌రుగులు చేసి కుల్దీప్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. రికెల్టన్‌ను (23), మార్క్‌రమ్ (31), కెప్టెన్‌ బవుమాను (3) ప‌రుగులు చేసి ఔట‌య్యారు.

Leave a Reply