ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా నేడు డబుల్ హెడర్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఢిల్లీ – హైదరాబాద్ మధ్య మ్యాచ్ విశాఖపట్నంలో జరగ్గా… చెన్నై – రాజస్థాన్ జట్లు గౌహతిలో తలపడనున్నాయి.
ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ రుతురాజ్.. బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో రియాన్ పరాగ్ నేతృత్వంలోని రాజస్థాన్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేపట్టనుంది.
వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న రాజస్థాన్ ఈరోజు మ్యాచ్ గెలిచి ఖాతా తెరవాలని చూస్తుంది. మరోవైపు, బెంగళూరు చేతిలో ఓటమితో కుంగిపోయిన చెన్నై కూడా ఈ మ్యాచ్ తో తిరిగి ట్రాక్ లోకి రావాలని భావిస్తొంది. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది.
తుది జట్లు
చెన్నై సూపర్ కింగ్స్ : రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), విజయ్ శంకర్, జామీ ఓవర్టన్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), నూర్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణ.
రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ.