బెంగళూరు వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది. చిన్న స్వామి స్టేడియంలో ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టు 2 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో తమ ఖాతాలో 16 పాయింట్లు వేసుకున్న ఆర్సీబీ.. టేబుల్ టాపర్ గా నిలిచింది.
కాగా, ఈ మ్యాచ్ లో 214 పరుగలు భారీ టార్గెట్ తో ఛేజింగ్ కు దిగిన సీఎస్కే.. ఆకరి వరకు పోరాడింది. ఓపెనర్ ఆయుష్ మార్రే (94 ; 48 బంతుల్లో 9ఫోర్లు, 5సిక్సులు), జడేజ (77 ; 45 బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సులు) అర్ధశతకాలతో దంచికొట్టారు. అయితే, ఆయుష్ మాత్రే ఔటైన తరువాత పుంజుకున్న ఆర్సీబీ బౌలర్లు.. చెన్నైని అద్భుతంగా కట్టడి చేశారు. దీంతో గెలుపు అంచుల వరకు వచ్చిన చెన్నై.. 2 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఆర్సీబీ బౌలర్లలో లుంగి నిగ్డి 3 వికెట్లు తీయగా.. కృణాల్ పాండ్యా, యష్ దయాల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య ఆర్సీబీ చెలరేగింది. ఓపెనర్లు జాకబ్ బెథెల్ (55 ; 33 బంతుల్లో 8ఫోర్లు, 2 సిక్సులు) విరాట్ కోహ్లీ (62 ; 33 బంతుల్లో 5ఫోర్లు, 5సిక్సులు) అర్ధశతకాలతో విరుచుకుపడ్డారు. ఆఖర్లో రొమారియో షెపర్డ్ (53 ; 14 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు – నాటౌట్) ఊచకోతకోశాడు. షెపర్డ్ హాఫ్ సెంచరీతో ఆర్సీబీ స్కోర్ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది.
చెన్నై బౌలర్లలో మథీష పతిరానా 3 వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్, సామ్ కర్రన్ చెరో వికెట్ పడగొట్టారు. దీంతో 214 పరుగుల భారీ టార్గెట్ తో సీఎస్కే ఛేజింగ్ కు దిగనుంది.