Bihar | 161 సీట్లల్లో ఎన్డీయే లీడ్​ ​

Bihar | బీజేపీ..జేడీయూ ఖుషీఖుషీ

( ఆంధ్రప్రభ, వెబ్​ డెస్క్)​

బీహార్ అధికారం దిశగా ఎన్డీయే కూటమి దూసుకు పోతోంది. కూటమి  బలంతో అధికార పీఠాన్ని కైవశం చేసుకుంటుందా? ఇప్పటికే మేజిక్​ ఫిగర్​ దాటేసింది.  మొత్తం 243 సీట్లకు గాను ఎన్డీయే కూటమి 150 సీట్లలో ముందంజలో ఉంది. ఈ కూటమిలో బీజేపీ101 సీట్లు, జేడియూ 101 స్థానాల్లో  పోటీ చేయగా..  బీజేపీ 82 సీట్లలో ముందంజ ఉంది. జేడీయూ 66 సీట్లలో ఆధిక్యంలో  ఉంది. ఇదే ఎన్డీయే కూటమిలోని ఎల్జేపీ 8 సీట్లలో, ఇతరులు 1 స్థానంలో ముందంజలో ఉన్నారు. మొత్తంగా ఎన్డీయే కూటమి 161 సీట్లలో ఆధిక్యంలో ఉంది. 76 స్థానాల్లో మహా ఘట్బంధన్​ ఆధిక్యంలో ఉంది. మూడు స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శించిన జేఎస్పీ రెండు స్థానాలకు పడిపోయింది.

Leave a Reply