Meeting | పని ప్రదేశాల్లో భద్రత అవసరం

Meeting | పని ప్రదేశాల్లో భద్రత అవసరం

  • ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్

Meeting | గుంటూరు, ఆంధ్రప్రభ బ్యూరో : పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ, భద్రత అవసరమని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. రాజకీయ పార్టీలు, వృత్తి పరమైన సంస్థలలో “పోష్ చట్టం” అమలు అవసరం అనే అంశంపై మహిళా కమిషన్ కార్యాలయంలో న్యాయవాదుల సౌజన్యంతో అభిప్రాయ వ్యక్తీకరణ (Sharing of thoughts) జరిగింది.

అనంతరం మీడియా ప్రతినిధుల సమావేశంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ మాట్లాడుతూ..
పని ప్రదేశాల్లో మహిళల రక్షణ, భద్రతపై సుప్రీమ్ కోర్టు (Supreme Court) అనేక తీర్పులు వెలువరించిందన్నారు. చట్టం అమలులో ఇంకా పూర్తి స్థాయి శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని అన్నారు. పని ప్రదేశంలో రక్షణ లేదనే భావన ఇప్పటికీ ఉందని, ఇది రాజకీయ పార్టీలలోనూ, బార్ అసోసియేషన్ లలోను, విద్యా సంస్థలు తదితర అన్ని ప్రదేశాల్లో అమలు జరగాలని చర్చ జరిగిందన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక (Report) సమర్పిస్తామని చెప్పారు. అసంఘటిత రంగంలో పరిస్థితులు కూడా అంచనా వేయవచ్చన్నారు.

చట్టాలను ఒక్కొక్కరు ఒక్కో విధంగా విశ్లేషణ చేయడం జరుగుతుందన్నారు. లైంగిక వేధింపులు పెరుగుతున్నాయని, అయినా కేసులు తక్కువ నమోదు అవుతున్నాయని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, బార్ అసోసియేషన్ లు కూడా వర్క్ ప్లేస్ గా వస్తుందని చెప్పారు. లైంగిక వేధింపులు పెరగటం, మహిళల రక్షణ, భద్రత అంశాలపై ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలలో పోష్ చట్టం అమలుపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు.

Meeting

విద్యా సంస్థలలో గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, విద్యార్థుల (Sucides) ఆత్మహత్యలు వంటి వాటి పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళమని, విద్యా సంస్కరణలను ప్రభుత్వం చేపట్టి అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో బాగా జరుగుతుందని అన్నారు. చిన్నతనం నుండే సరైన ఆలోచన కల్పించడం వలన లైంగిక వేధింపులు వంటి సమస్యలు ఉత్పన్నం కావని అభిప్రాయపడ్డారు. సామాజిక కళంకం (Social stigma) కలుగుతుందనే ఆలోచనతో బయటకు చెప్పకుండా ఉండటం కూడా జరుగుతుందని చెప్పారు. కుటుంబాల్లో ఆలోచన విధానం మరాలన్నారు.

సీనియర్ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ లైంగిక వేధింపుల నివారణకు సుప్రీం కోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు. మహిళా చట్టాలు దుర్వినియోగం(Abuse of laws) అవుతున్నాయనే నెపంతో ఆ చట్టాలను నిర్వీర్యం చేయకూడదన్నారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా చట్టాలను మార్పు చేసి అమలు చేయాలని అన్నారు. పని ప్రదేశం నిర్వచనం విస్తృతం చేయాలన్నారు. రాజకీయ పార్టీలు, క్యాంటీన్, బార్ అసోసియేషన్ లు, డిజిటల్ ప్లాట్ ఫామ్ లు తదితర అన్ని ప్రదేశాలు పని ప్రదేశంగా ఉంటుందని చెప్పారు.

రాజకీయ పార్టీలు, బార్ అసోసియేషన్ లు ప్రజల కంటే దూర దృష్టి కలిగి ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు(Political parties) ఇప్పటికే పాటిస్తున్నాయని పేర్కొన్నారు. 20 శాతం మహిళలు న్యాయ వ్యవస్థ లో ఉన్నారని, క్రింద స్థాయి కోర్టులలో 50 శాతం వరకు ఉన్నారని తెలిపారు. పని ప్రదేశంలో మహిళలకు రక్షణపై విశ్వాసం కలిగించాలన్నారు. “చదువుకున్న వారమే, విజ్ఞాన వంతులమే” అయినా ఎందుకు వేధింపులు జరుగుతున్నాయి – సమాజంలో మార్చాల్సిన అంశాలు(Things to change) చాలా ఉన్నాయన్నారు. పెద్ద స్థాయిలో ఉన్నవారికి కూడా వేధింపులు తప్పడం లేదని, మహిళల్లో ఉన్న పురుష ఆధిక్య ఆలోచనలు మారాలన్నారు.

ఇతర న్యాయవాదుల తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ప్రతి ప్రదేశాన్ని పని ప్రదేశంగా గుర్తించాలని, ఎలక్ట్రానిక్ మీడియాలో(In electronic media) ఎక్కువ ప్రసారం చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని, చట్టాలు పూర్తి స్థాయిలో అమలు కావాలని, పాఠ్యాంశాల్లో భాగం చేయాలని, పని కోసం వెళ్ళే ప్రదేశం కూడా సురక్షితం కావాలని, తప్పు జరిగితే ఆధారాలు ఉండటం లేదని, ప్రత్యేక కోర్టులు ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ సిఫారసు చేసిన అంశాలతో కూడిన పత్రాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు అందజేశారు.

Leave a Reply