Delhi | భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ నగరంలో భారీ అగ్నిప్రమాదం జ‌రిగింది. బుధవారం ఉదయం ఢిల్లీ (Delhi) లోని రిఠాలా మెట్రో స్టేషన్‌ సమీపంలో ఉన్న పాలిథీన్‌ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు (Heavy fire) ఎగిసిపడి దట్టంగా పొగ అలుముకుంది. ఈ ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని ముగ్గురు మృతి (3 people died) చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని 16 ఫైరింజన్ల తో సహాయక చర్యలు (Assistive measures) చేపట్టింది. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముగ్గురు మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదు. షాట్ సర్క్యూట్ వల్ల జరిగిందా? లేక ఎవరైనా చేశారా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply