ప్రమాదంపై పలు అనుమానాలు..
కర్నూల్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఇటీవల జరిగిన బస్సు దగ్ధం గురించి తెలిసిందే. అయితే.. ఈ బస్సు దగ్ధం కేసులో కొత్త పరిణామం చోటు చేసుకుంది. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు(Kaveri Travels Bus) ప్రమాదం పై పలు అనుమానాలు ఉన్నాయని సమగ్ర విచారణ జరిపించాలని ఈ రోజు ఎన్హెచ్ఆర్సీ(NHRC)లో ఫిర్యాదు అందింది.
తమిళనాడుకు చెందిన తెలుగు యువశక్తి చీఫ్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి(Ketireddy Jagadeeswar Reddy) జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు.

