మంగళగిరి ఆంధ్రప్రభ: మంగళగిరి పట్టణంలోని కరూర్ వైశ్యా బ్యాంకులో గత రెండు నెలల క్రితం వెలుగులోకి వచ్చిన 9 కోట్ల 20 లక్షల గోల్డ్ గోల్మాల్ విషయం పై పట్టణ పోలీసులు 50 మంది పై కేసు నమోదు చేశారు. ఇందులో ప్రధాన సూత్రధారులుగా అనుమానిస్తున్న రాజశేఖర్ రెడ్డి ప్రకాష్ మదన్ కుమార్ తో పాటు మరో 47 మంది ఖాతాదారులపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
గత రెండు నెలల క్రితం కరూర్ వైశ్యా బ్యాంకులో 47 మంది ఖాతాదారులు నాణ్యత తగ్గిన బంగారాన్ని కుదువ పెట్టి 9 కోట్ల 20 లక్షలు రుణం పొందినట్లు ప్రస్తుతం మేనేజర్ ప్రవీణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ విషయంలో గోల్డ్ అప్రైజర్ మదన్ కుమార్ తో పాటు మరో ఇద్దరు ప్రమేయం ఉన్నట్లు నూతన మేనేజర్ ఫిర్యాదు చేసిన సంగతి విధితమే.
ఈ విషయంలో దర్యాప్తు చేసిన పోలీసులు 50 మంది పై కేసు నమోదు చేసినట్లుగా తెలిసింది. దీనిపై పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మదన్ అదృశ్యం పై తల్లి ఫిర్యాదు..!
ఇందులో అసలు ట్విస్ట్ ఏమిటంటే తొమ్మిది కోట్ల 20 లక్షల గోల్డ్ గోల్మాల్ విషయంలో కరూర్ వైశ్యా బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ గా పనిచేస్తున్న చుండూరు మదన్ కుమార్ ప్రధాన పాత్ర ఉన్నట్లుగా బ్యాంకు అధికారులు గుర్తించారు. అయితే మదన్ కుమార్ తల్లి చుండూరు విజయలక్ష్మి గతవారం నుండి తన కుమారుడు మదన్ కనిపించడం లేదని స్పందనలో ఫిర్యాదు చేసింది. తన కుమారుడు అదృశ్యం విషయంలో హైమావతి, అభినయ్, కొల్లి కోటి, వెంకట్, మణికంఠ కరుణాకర్, జీవన్, తో పాటు మరికొందరి పా త్ర ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసిందని తెలిసింది.
ఇందులో ప్రధానంగా మహిళ పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ఆమె మదన్ తల్లి ఇంటి దగ్గరకు వచ్చి మీ కుమారుడు ఉన్నాడో చచ్చిపోయాడో తెలుసుకోరా అంటు పరుషపదజాలం వాడిందని మధన్ తల్లి విజయలక్ష్మీ పిర్యాదులో పెర్కోంది. ఆమెతో పాటు పలువురి నుంచి ప్రాణహాని ఉందని గతంలో తన కుమారుడు తమ కుటుంబ సభ్యుల వద్ద తెలిపినట్లు ఆమె పిర్యాదులో పొందుపరచటం పై సదరు వ్యక్తులపై అనుమానాలకు తావిస్తోంది.
దీనికి సంబంధించి రూరల్ పోలీసులు పిర్యాదులో పేర్కోన్న వారికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చి విచారణకు స్టేషన్కు రమ్మన్నట్లు విశ్వసనీయ సమాచారం. అసలు మధన్ ఎక్కడా, కనిపించక పోవటంలో తల్లి విజయలక్ష్మి చేసిన పిర్యాదులో వారికి ఉన్న సంబందం, వారి పాత్రలు అనేక కోణంలో రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తే గాని అసలు నిజాలు వెల్లడి కాగలవు.
ఆందోళనలో ఖాతాదారులు..?
వాస్తవానికి కరూర్ వైశ్యా బ్యాంకులో ని ఖాతాదారులు ఆందోళన చెందుతున్నట్లుగా సమాచారం. నాణ్యత తక్కువగా ఉన్న బంగారాన్ని అధికారులు బ్యాంకులో ఎలా కుదువ పెట్టుకున్నారు దీని వెనుక ఏమి జరుగుతోంది. తాము కుదువ పెట్టుకున్న బంగారం పరిస్థితి ఏమిటో అని ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనా ఈ గోల్డ్ గోల్మాల్ కుంభకోణం వెనుక అసలు పాత్రధారులు ఎవరు? రుణం తీసుకున్న సొమ్ము 47 మంది ఖాతాదారుల కు అందిందా లేదా ఆ పేరుతో వేరే ఎవరైనా తీసుకున్నారా అని మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.
దర్యాప్తు చేస్తున్నాంపట్టణ సీఐ దిలీప్ కుమార్
కరూర్ వైశ్యా బ్యాంకు లోని గోల్డ్ గోల్ మాల్ కేసు దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ డీ దిలీప్ కుమార్ తెలిపారు. ఇందులో టెక్కీ ప్రకాష్ అనే వ్యక్తి ప్రధాన ముద్దాయి అని మిగతా రాజశేఖర్ రెడ్డి గోల్డ్ అప్రైజర్ మదన్ కుమార్ తో పాటు ఎవరైతే గోల్డ్ తనకా పెట్టి రుణం పొందిన 47 మంది కి ఇందులో ప్రమేయం ఉందా లేదా అనేది దర్యాప్తు చేయవలసి ఉందని సీఐ తెలిపారు.