కర్ణాటక: లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందిన ఘటన ఇవాళ తెల్లవారుజామున కర్ణాటకలోని కలబురగి జిల్లా జీవర్గి సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 19మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతఘాత్రులని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
వీరంతా హజరత్ కాజా గరీబ్ నవాజ్ దర్గాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా బాగల్ కోటకు చెందిన వారని పోలీసులు తెలిపారు. మృతులు మెహబూబ్ (53) మహబూబ్ (29) వాజిద్ (2) మాలన్ (52) ప్రియాంక (13)లుగా పోలీసులు గుర్తించారు.