కడెం, ఆంధ్రప్రభ : ఉమ్మడి అదిలాబాద్(Adilabad) జిల్లాలో రెండు, మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల(Heavy rains)తో నిర్మల్(Nirmal) జిల్లా కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు(Kadem Narayana Reddy Project) లోకి భారీగా వరద చేరుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమై నాలుగు గేట్లు ఎత్తి వేసి 24 వేల క్యూసెక్కుల నీరు గోదావరి నది(Godavari River)లోకి విడిచిపెడుతున్నారు.
కడెం ప్రాజెక్టు వివరాలు
ఇన్ఫ్లో : 12 వేల క్యూసెక్కులు
అవుట్ఫ్లో : 24 వేల క్యూసెక్కులు
పూర్తి స్థాయి నీటి మట్టం : 700 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం : 698 అడుగులు
కడెం ప్రాజెక్టు సమాచారం
