Iran-Retaliation-Us-Bases : ఇరాన్ ప్రతీకారం Andhra Prabha Top News
Iran-Retaliation-Us-Bases : ఇరాన్ ప్రతీకారం Andhra Prabha Top News
- అమెరికా స్థావరాలు ధ్వంసం
- బహ్రెయిన్, జోర్డాన్, కువైట్ ల్లో కలవరం
- ని్ఖా వేడుకల్లో 12 మంది మృతి
- ప్టాక్ మార్కెట్లు డమాల్
- ఆయిల్ ధరకు ఆజ్యం
- మద్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధం
(ఆంధ్రప్రభ, వాషింగ్టన్/ టెహ్రాన్)

ఇరాన్, అమెరికా మధ్య భృకర యుద్ధం రాజుకుంది. జూలై తర్వాత అతిపెద్ద కాల్పుల మోత మోగుతోంది. ఇరాన్, అరబ్ దేశాలు బుధవారం తిరిగి యుద్ధ యుద్ధ బరికి చేరుకున్నాయి. . ఇరాన్ దక్షిణ తీరంపై అమెరికా దళాలు దాడులు చేయగా, అమెరికా స్థావరాలపై ఇరాన్ ఎదురుదాడికి దిగింది.మరింత విధ్వంసకర దాడులు చేస్తామని అమెరికా హెచ్చరించింది. ఒక వివాహ వేడుకపై అమెరికా దాడి నేపథ్యంలో ఇరాన్ ప్రతిదాడికి దిగింది.
స్టాక్ మార్కెట్లు డమాల్
అమెరికా జరిపిన తాజా వైమానిక దాడుల తర్వాత ఆసియా ఐరోపా స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. ఈ దాడుల కారణంగా చమురు ధరలు జూలై తర్వాత ఎన్నడూ లేనంత స్థాయికి పెరిగాయి; ఇంధన సరఫరాల్లో అంతరాయం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుండగా, బాండ్ల అమ్మకాల ఒత్తిడితో కలిపి ఈ పరిస్థితి ఆర్థిక వ్యవస్థపై మరింత భారాన్ని మోపుతోంది. ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’కు చెందిన వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్ వ్యవస్థలు, నౌకాదళ ఆస్తులు, మందుపాతరలు అమర్చే సామర్థ్యాలు సమాచార వ్యవస్థల కేంద్రాలపై దాడులు చేసినట్లు అమెరికా సైనిక దళాల సెంట్రల్ కమాండ్ తెలిపింది. హార్ముజ్ జలసంధి సమీపంలోని అనేక లక్ష్యాలపై దాడులు జరిగినట్లు ఇరాన్ మీడియా నివేదించింది; తమ అనుమతి లేకుండా ప్రయాణించడానికి ప్రయత్నించే నౌకలను (ట్యాంకర్లను) అడ్డుకుంటామని టెహ్రాన్ గతంలోనే హెచ్చరించిన జలమార్గం పైనే ఆ దాడి జరిగింది.
ఇరాన్ ఎదురు దాడి

బహ్రెయిన్, జోర్డాన్, కువైట్ ఇరాక్లలోని అమెరికా ఆస్తులుగా భావించే వాటిపై దాడులకు ఇరాన్ దిగింది. మధ్యప్రాచ్యం అంతటా దశాబ్దాలుగా అమెరికా నిర్వహిస్తున్న విస్తృత సైనిక స్థావరాల నెట్వర్క్ నుండి అమెరికా దళాలను వెళ్లగొట్టడమే తమ లక్ష్యమని ఇరాన్ ప్రకటించింది.
నిఖా వేడుకలో 12 మంది మృతి

అమెరికా జరిపిన దాడుల్లో 12 మంది మరణించారని ఇరాన్ నివేదించింది. జలసంధి తీరప్రాంతంలోని సిరిక్ పట్టణంలో ఒక ఇంట్లో వివాహ వేడుక జరుగుతుండగా..ఈ దాడి జరిగింది. 68 మంది వరకు గాయపడ్డారని ఇరాన్ మీడియా పేర్కొంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన పిల్లల చిత్రాలను విడుదల చేసింది. యుద్ధం జరిగిన మొదటి రాత్రి బాలికల పాఠశాలపై జరిగిన దాడిలో 160 మంది మరణించిన ఘటనతో ఇరాన్ అధికారులు ఈ సంఘటనను పోల్చారు. దాడి జరిగినట్లు చెబుతున్న ప్రదేశంలో ఇరాన్కు చెందిన ‘వెస్ట్ ఆసియా న్యూస్ ఏజెన్సీ’ చిత్రీకరించిన వీడియోలో, ఒక ఇంటి గదులు ఆవరణలో శిథిలాలు పడి ఉండటం కనిపించింది. రక్తం మరకలతో నిండిన కార్పెట్పై మహిళలు ధరించే ఒక జత చెప్పులు పడి ఉన్నాయి.
