హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ -టె-క్నాలజీ (ఐఎంటి) హైదరాబాద్, అభ్యుదయం 2025 పేరిట మేనేజ్మెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ను 2025-27 బ్యాచ్ కోసం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి టిసిఎస్ హైదరాబాద్ హెడ్ చల్లా నాగ్, ఎలికో లిమి-టె-డ్ వైస్ చైర్పర్సన్ డా.వనితా దట్ల, ఐఎంటీ- హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ (డాక్టర్) బహరుల్ ఇస్లాం హాజరయ్యారు. కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన దిశానిర్దేశాన్ని తన ప్రారంభ ఉపన్యాసంలో డాక్టర్ బహరుల్ ఇస్లాం చేశారు.
ప్రస్తుత మేనేజ్ మెంట్ విద్య, వాస్తవ పరిస్థితులను గురించి డా.వనితా దాట్ల మాట్లాడారు. సంక్లిష్ట ప్రపంచంలో సమాచారం, చురుగ్గా, అనుకూలతను కలిగి ఉండటం ప్రాముఖ్యతను తెలిపారు. సాంకేతికత ఎలా వేగంగా అభివృద్ధి చెందుతుందో చెప్పిన ఆమె మార్పును ముందుగానే స్వీకరించాలని విద్యార్థులకు సూచించారు.
టిసిఎస్ హైదరాబాద్ హెడ్ చల్లా నాగ్ మాట్లాడుతూ… సాంకేతికత పరిశ్రమలను ఎలా పునర్నిర్మిస్తుందో తెలిపారు. ఏటీ-ఎంల నుండి మొబైల్ బ్యాంకింగ్ వరకు, ప్రాథమిక ఏఐ అప్లికేషన్ల నుండి ఏజెంటిక్ ఏఐ వరకు – సమగ్రమైన వ్యాపార పరిష్కారాలను అందించే స్వయంప్రతిపత్త ఏఐ ఏజెంట్ల వరకు ఆయన తన ప్రసంగంలో ఉటంకించారు. క్లౌడ్ కంప్యూటింగ్, ఐఓటి, సైబర్ సెక్యూరిటీ- ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు. విద్యార్థులు సాంకేతికతను తెలుసుకోవాలని, దానిని ఎక్కడ, ఎలా బాధ్యతాయుతంగా ఉపయోగించవచ్చో అర్థం చేసుకోవాలని కోరారు. మీరు ఏమి అందించగలరో వాగ్దానం చేయండి, వాగ్దానం చేసిన వాటిని అందించండని విద్యార్థులకు సూచించారు.