Saturday, September 21, 2024

కొవిడ్ మృతుల కుటుంబాల‌కు ప్ర‌భుత్వం ఊర‌ట‌

రాష్ట్ర ప్ర‌భుత్వం కొవిడ్ మృతుల కుటంబాల‌కు రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వ‌నున్న‌ట్టు తెలిపింది. ఈ మేర‌కు రాష్ట్ర విపత్తుల నిర్వ‌హ‌ణ నిధుల నుంచి ఈ ప‌రిహారం అంద‌జేయ‌నున్నారు.కొవిడ్ డెత్ స‌ర్టిఫికెట్ ఇచ్చేందుకు అధికారుల‌తో క‌మిటీ ఏర్పాటు చేయ‌నున్నారు. మృతుల కుటుంబ స‌భ్యుల ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలి. ఈ ద‌ర‌ఖాస్తుల‌ను ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు ప‌రిశీలించి అర్హులైన వారికి ప‌రిహారం అంద‌జేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు అందిన 30 రోజుల్లో అర్హులైన వారికి, ఆధార్‌తో లింకు ఉన్న బ్యాంకు ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ చేయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement