Sunday, June 30, 2024

YSRCP – అదైర్య పడొద్దు ..! రాబోయే రోజులు మనవే – జగన్


( ఆంధ్రప్రభ స్మార్ట్, పులివెందుల ప్రతినిధి) – వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటన ముగిసింది. మూడు రోజులుగా పులివెందులలో ప్రజా దర్బార్ నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నాం తన పర్యటన ముగించుకుని సతీసమేతంగా బెంగళూరుకు వెళ్లారు. పులివెందులలో వైఎస్ జగన్ ను.. వైఎస్సార్ కడప జిల్లాతో పాటు కర్నూలు, అనంతపురం, చిత్తూరు.. చుట్టు పక్కల నుంచి పార్టీ శ్రేణులను కలిశారు. పార్టీ నాయకుల్ని, అభిమానుల్ని కలవడంతో పాటు వాళ్ల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు.. అనారోగ్యంతో మృతి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు సంకిరెడ్డి మృతదేహానికి జగన్ దంపతులు నివాళులర్పించారు. సంకిరెడ్డి కుటుంబాన్ని జగన్ ఓదార్చారు.

భయం వద్దు.. మంచిరోజులొస్తాయి

- Advertisement -

తన మూడు రోజుల పులివెందుల పర్యటనలో పార్టీ నాయకులతో ఎన్నికల ఓటమిపై సమీక్ష జరిపిన ఆయన.. అధైర్య పడొద్దని, రాబోయే రోజులు పార్టీవేనని, ఉత్సాహంగా పని చేయాలని సూచించారు. మరోవైపు సొంత నియోజకవర్గంలో వైఎస్ జగన్ ను అడుగడుగునా సాదర స్వాగతం లభించింది. ఆయన్ని కలిసేందుకు కార్యకర్తలు, ప్రజలు పులివెందుల క్యాంప్ కార్యాలయానికి క్యూ కట్టారు. ఎన్నికల ఫలితంతో సంబంధం లేకుండా మీ వెంటే ఉన్నామంటూ నియోజకవర్గం.. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రజానీకం నినాదాలతో చాటి చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement