Friday, September 6, 2024

సీబీఐ అధికారులను కలిసిన వివేకా కుమార్తె

దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా కుమార్తె సునీత శుక్రవారం నాడు ఢిల్లీలోని సీబీఐ అధికారులను కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సునీత.. హత్య జరిగి రెండేళ్లు దాటినా నిందితులను పట్టుకోలేకపోయారని, ఎవరు హత్య చేశారో ఇప్పటివరకూ తెలియలేదని వాపోయారు. ఈ హత్య గురించి వదిలేయమని తనకు చాలా మంది సలహా ఇచ్చారని ఆరోపించారు. కానీ తన మనసు మాత్రం న్యాయం కోసం పోరాడాలని చెబుతోందని తెలిపారు. వివేకానందరెడ్డి ఎలాంటివారో అందరికీ తెలుసన్న సునీత.. ఆయన హత్యపై చులకనగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి హత్య కేసులో విచారణలో జాప్యంపై సునీత అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయం కోసం ఇంకెన్నాళ్లు ఆగాలని ఆమె ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement