Friday, September 20, 2024

Breaking: రైలుకిందపడి యువజంట ఆత్మహత్య.. గుర్తుపట్టలేనంతగా మృతదేహాలు

రాజస్థాన్​లో ఇవ్వాల ఓ దారుణం జరిగింది. స్పీడుగా వస్తున్న రైలు ముందు దూకి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. సికర్-చురు రైలు మార్గంలో రషీద్‌పురా సమీపంలో రైలు ముందు దూకి యువ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాటసారులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. వారి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, దాని ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కదులుతున్న రైలు ముందు దూకి యువకుడు, యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు తమకు సమాచారం అందిందని సదర్ ఠాణాలోని హెడ్ కానిస్టేబుల్ సికార్ రాకేష్ తెలిపారు.  ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఎస్‌కే ఆస్పత్రికి తరలించారు. ఫోన్ లాక్ కావడంతో మృతదేహాలను గుర్తించడం తక్షణమే సాధ్యం కానప్పటికీ, దర్యాప్తు కొనసాగతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement