Saturday, October 19, 2024

Wrestling | భారత్‌కు మరో పతకం పక్కా.. ఫైనల్స్‌కు వినేష్ ఫోగట్

ఒలింపిక్స్లో భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈరోజు జ‌రిగిన మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీలు రెజ్లింగ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. దీంతో పారిస్ ఒలంపిక్స్ లో భార‌త్ కు మ‌రో ప‌తకం ఖాయం అయ్యింది.

కాగా, ఈరోజు జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో వినేష్ ఫోగట్ క్యూబాకు చెందిన యుస్నెలిస్ గుజ్మాన్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఒక్క పాయింట్ కూడా సాధించే అవకాశం ఇవ్వకుండానే వినేష్ ఫోగట్ 5–0 తేడాతో ప్రత్యర్థిని ఓడించి ఒలంపిక్స్ ప‌త‌కం కోసం ప‌ట్టు బిగించింది.

అంతకుముందు క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఉక్రెయిన్‌ 7-5తో చిత్తుచేయ‌గా… ప్రీక్వార్టర్స్‌లో, గతంలో ఒలింపిక్ బంగారు పతక విజేత, జపాన్‌కు చెందిన యు సుకికిని 3-2 స్కోరుతో ఓడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement