Thursday, October 3, 2024

IND vs ZIM | జింబాబ్వేపై మరో విజయం.. సిరీస్‌లో టీమిండియా లీడ్

జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమిండియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 182 పరుగులు బాదింది. ఆ తర్వాత ఛేజింగ్ ప్రారంభించిన జింబాబ్వే జట్టను కట్టడి చేసి.. 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.

జింబాబ్వే బ్యాటర్లలో డియోన్ మైయర్స్ (65 నాటౌట్) హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. అయితే, మిగిలినవి అంతగా రాణించలేదు. ఫలితంగా జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులకే పరిమితమైంది. టీమిండియా బౌలర్లలో ఖలీల్ అహ్మద్ (1/15), అవేష్ ఖాన్ (2/39), వాషింగ్టన్ సుందర్ (3/15) వికెట్లు తీశారు. ఇక ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో నిలిచింది.

అంతకముందు టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (49 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. శుభ్‌మన్ గిల్ కి తోడుగా రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49), యశస్వి జైస్వాల్ (27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36) కీలక ఇన్నింగ్స్ ఆడారు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబని(2/25), సికందర్ రాజా(2/24) రెండేసి వికెట్లు తీసారు. దాంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement