Sunday, September 15, 2024

Modi | ఈసారి మోదీ మెజార్టీ ఎంత?.. అందరి ఫోకస్ వార‌ణాసిపైనే

దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఇవ్వాల‌ (మంగళవారం) వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు ఎన్నిక‌ల బ‌రిలో దిగి స‌త్తా చాటి వాళ్లున్నారు. అయితే ఈ సారి వారి మెజార్టీ ఎలా ఉండ‌బోతోంద‌నే దానిపై చాలామంది ఆస‌క్తి చూపుతున్నారు. గత ఎన్నికల్లో కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందా? రాదా! అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖులు పోటీ చేసిన పలు నియోజకవర్గాల ఫలితాలపై ఆసక్తి నెలకొంది.

కొన్నిచోట్ల వార్‌ వన్‌సైడ్‌ అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతుండగా, మరికొన్నిచోట్ల తీవ్రమైన పోటీ ఉంటుంద‌ని అంటున్నారు. రెండు పర్యాయలుగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో బంపర్‌ మెజారిటీతో గెలిచిన ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తున్నారు. అయితే.. వారణాసిలో మోదీ విజయం ఈజీయేన‌ని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అటు బీజేపీ శ్రేణులు సైతం మోదీకి ఎంత మెజారిటీ వస్తోందో అని లెక్కలు వేస్తున్నారు. ఇక‌.. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు కూడా బీజేపీకి అనుకూలంగా రావడంతో ఆ పార్టీలో మరింత జోష్ క‌నిపిస్తోంది. వార‌ణాసి బ‌రిలో మోదీపై పోటీగా కాంగ్రెస్ తరఫున అజయ్‌ రాయ్‌ నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement