Saturday, October 5, 2024

West Bengal | నాపై దీదీ సర్కారు నిఘా : గవర్నర్​ ఆనంద బోస్​

బెంగాల్​ గవర్నర్​ సీవీ ఆనంద బోస్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్​భవన్​లో తన వ్యక్తిగత భద్రత కొరవైందన్నారు. తనపై పోలీసు సిబ్బంది నిఘా ఉంచారని దీనిపై ఆధారాలు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటికే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఇటీవల గవర్నర్​కు, ప్రభుత్వానికి మధ్య వివాదం ముదురుతుంది. లోక్​సభ ఎన్నికల తర్వాత గొడవలు జరుగగా బాధితులతో కలిసి గవర్నర్​ను కలిసేందుకు వచ్చిన విపక్ష నేత సువేందు అధికారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన కొలకత్తా కోర్టుకు వెళ్లగా అనుమతి ఉంటే గవర్నర్​ను కలవచ్చని తీర్పునిచ్చింది. ఈ విషయంలో పోలీసుల తీరును తప్పుబడుతూ బోస్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement