Friday, September 20, 2024

Delhi: కేరళను ముందే హెచ్చరించాం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా

భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయని తాము కేరళను ముందే హెచ్చరించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ ముప్పు గురించి కేంద్రం జులై 23నే అప్రమత్తం చేసిందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పౌరులను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించలేదన్నారు.

భారీ వర్షాలు కురవగానే 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేరళకు పంపించినట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. కొండచరియలు విరిగిన ఘటనలో మృతుల సంఖ్య 183కి చేరింది. వయనాడ్‌లో సహాయక చర్యల్లో ఆర్మీ పోర్టబుల్ బ్రిడ్జిలను వినియోగిస్తోంది.

వీటిని రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తొలిసారి ఉపయోగించారు. ఈ బ్రిడ్జిలను హెలికాప్టర్ల సహాయంతో తరలించేందుకు వీలుంటుంది. ఢిల్లీ నుంచి 110 అడుగుల బ్రిడ్జిని తీసుకువచ్చారు. మరో 170 అడుగుల వంతెనను తయారు చేయాలని ఆర్మీ భావిస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement