Wednesday, September 18, 2024

TG: విద్యుత్ సమస్యలు లేకుండా చూస్తున్నాం.. భట్టి విక్రమార్క

పెద్ద సంఖ్యలో సబ్ స్టేషన్ల నిర్మాణం
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క


ధర్మారం, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ఏ గ్రామంలో కూడా విద్యుత్ సమస్యలు లేకుండా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలియజేశారు. శనివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలో సబ్ స్టేషన్ నిర్మాణ పనులను ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ… లో ఓల్టేజి సమస్యలు లేకుండా పెద్ద సంఖ్యలో సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టామన్నారు. అవసరమున్న ప్రతి చోట ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నాణ్యమైన విద్యుత్తును ప్రజలకు అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. జిల్లాకు విచ్చేసిన ఉపముఖ్యమంత్రి భట్టికి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement