Monday, October 21, 2024

Vizianagaram – గుర్ల డ‌యేరియా బాధితుల‌కు ప‌వ‌న్ ప‌రామ‌ర్శ ..

బాధితుల‌కు అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా
మెరుగైన వైద్య సేవ‌ల‌కు అదేశం
ప‌వ‌న్ చూసేందుకు వేలాదిమంది అభిమానులు రాక‌
వారిని నియంత్రించ‌లేక పోలీసుల అవ‌స్థ‌లు
హాస్ప‌ట‌ల్ లోకి ఫాన్స్ చొచ్చుకురావ‌డంతో అస‌హ‌నం
అర్ధంత‌రంగా ముగిసిన ప‌వ‌న్ ప‌రామ‌ర్శ ప‌ర్య‌ట‌న

విజయనగరం జిల్లా గుర్లలో నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటించారు. స్థానిక పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను ఆయన పరామర్శించారు. వ్యాధి వ్యాప్తి, కారణాలపై అధికారులను ఆరా తీశారు. అనంత‌రం మూడు కుటుంబాలతోనే ఆయన మాట్లాడారు. బాధితుల‌కు స‌రైన వైద్య సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అలాగే డ‌యేరియాతో మ‌ర‌ణించిన కుటుంబాల‌కు అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చారు.

కాగా, ప‌వ‌న్ వ‌స్తున్న విష‌యం తెలుసుకున్న అభిమానులు వేల సంఖ్య‌లో ప్రాథ‌మిక ఆరోగ్యం కేంద్రం వ‌ద్ద‌కు చేరుకున్నారు.. ఒక్క‌సారిగా అంత‌మంది రావ‌డంతో వారిని నియంత్రించ‌డం పోలీసుల త‌రం కాలేదు.. దీంతో ప‌వ‌న్ ను త్వ‌ర‌గా అక్క‌డ నుంచి వెళ్లవ‌ల‌సిందిగా అభ్య‌ర్ధించారు.. అభిమానులు హాస్ప‌ట‌ల్ లోకి సైతం చొచ్చుకురావ‌డంతో అయ‌న అర్ధంత‌రంగా బాధిత ప‌రామ‌ర్శ‌ను ఆపివేసి మ‌రో కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు బ‌య‌లుదేరి వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement