Monday, October 21, 2024

Delhi: వినేశ్.. మీరు ఛాంపియ‌న్ల‌కే ఛాంపియన్: మోదీ

పారిస్ ఒలింపిక్స్ లో రెజ్లర్ వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు పడటంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘వినేశ్.. మీరు చాంపియన్లలోనే ఛాంపియన్. మీరు భారత్ కు గర్వకారణం. భారతీయులందరికీ స్ఫూర్తి. ఈ రోజు మీకు తగిలిన ఎదురుదెబ్బ ఎంతో బాధించింది. దీన్ని వ్యక్తం చేయడానికి నా దగ్గర మాటల్లేవు. కానీ, ఈ బాధ నుంచి బయటపడి మీరు బలంగా తిరిగి రాగలరని నేను నమ్ముతున్నా. సవాళ్లను ఎదురించడం మీ నైజం. మీకు మేమంతా అండగా ఉన్నాం” అని మోదీ భరోసానిచ్చారు. అధిక బరువు కారణంగా వినేశ్ పై అనర్హత వేటు పడింది. దీంతో ఆమె పతక ఆశలు గల్లంతయ్యాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement