Monday, September 16, 2024

Vijayawada – విఘ్న‌రాజుకు తొలి పూజ చేసిన సీఎం చంద్ర‌బాబు

ప్ర‌జ‌ల‌ను చ‌ల్ల‌గా చూడు స్వామీ

విజ‌య‌వాడ క‌లెక్ట‌రేట్‌లో చ‌వితి వేడుక‌లు

ఆశీర్వ‌చ‌నం అంద‌జేసిన వేద పండితులు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, ఎన్టీఆర్ జిల్లా బ్యూరో :వరద ముంపు ప్రాంతాల పరిశీలన, సహాయక చర్యల పర్యవేక్షణతో గత కొన్ని రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబు క్షణం తీరిక లేకుండా ఉన్నారు. విజయవాడ వరద గుప్పిట్లో చిక్కుకున్నప్పటి నుంచి ఆయన విజయవాడ కలెక్టరేట్ తన నివాసంగా చేసుకున్నారు. అక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో, చంద్రబాబు ఇవాళ వినాయక చవితి పండుగను తన నివాసంలో కాకుండా విజయవాడ కలెక్టరేట్ లోనే జరుపుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గణేశుని పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదపండితులు సీఎంకు ఆశీర్వచనం అందించారు. ఈ పూజలో చంద్రబాబుతో పాటు మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement