Thursday, September 19, 2024

న‌టుడు ప్ర‌తాప్ పోతెన్ క‌న్నుమూత‌-సెల‌బ్రిటీల సంతాపం

సినీ ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టికే ఎన్నో విషాదాలు చోటు చేసుకున్నాయి. ప‌లువురు ప్ర‌ముఖులు క‌న్నుమూశారు. కాగా తాజాగా ప్రముఖ నటుడు ప్రతాప్ పోతెన్ కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు.ఆయన వయసు 69. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో ఆయన ఎన్నో సినిమాల్లో నటించారు. అంతేకాకుండా డైరెక్టర్‌గా, నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తెలుగులో ఆకలి రాజ్యం, కాంచన గంగ, జస్టిస్ చక్రవర్తి, మరోచరిత్ర వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఆయన నటించారు. ఆయన అన్ని భాషల్లో కలిపి వందకుపైగా సినిమాల్లో యాక్ట్ చేశారు. సీనియర్ నటి రాధికను 1985లో ప్రతాప్ పెళ్లి చేసుకున్నారు. అయితే 1986లో వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తరువాత 1990లో అమలా సత్యనాథ్‌ను రెండో వివాహం చేసుకున్నారు. వీరిద్దరు కూడా 2012 లో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికి ఓ కుమార్తె ఉంది.ఈయ‌న మ‌ర‌ణం ప‌ట్ల ప‌లువురు సెల‌బ్రిటీలు సంతాపం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement