Tuesday, October 22, 2024

విజయవాడ టు పులివెందుల… వయా జగన్

ప్రభుత్వ కార్యాలయాలు విజయవాడ నుంచి ఒక్కొక్కటిగాబ్ తరలిపోతున్నాయి. వికేంద్రీకరణ లో భాగంగా జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలో ఉన్న వెటర్నరీ బయోలాజికల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కడప జిల్లాలో ఉన్న పులివెందులకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది.

పులివెందులలో ఉద్యోగులకు క్వార్టర్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించింది. మరోవైపు కమాండ్ కంట్రోల్ రూమ్ ను విశాఖ తరలించేందుకు ఇటీవలే ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది. గత ప్రభుత్వం కమాండ్ కంట్రోల్ సెంటర్ కోసం విజయవాడలో స్థలాన్ని ఎంపిక చేసింది. కాగా జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ నిర్ణయం కూడా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement