Saturday, October 5, 2024

Uttarkhand – లోయ‌లో ప‌డ్డ పెళ్లి బృందం బ‌స్సు – 30 మంది దుర్మ‌ర‌ణం

మ‌రో 25 మందికి తీవ్ర‌గాయాలు
కొన‌సాగుతున్న స‌హాయ కార్య‌క్ర‌మాలు
ఉత్త‌రాఖండ్ లో ఘ‌ట‌న….

ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తోన్న బస్సు 200 అడుగుల లోతులో ఉన్న లోయలో పడిపోయింది.. ఇప్ప‌టి వ‌ర‌కు అందిన స‌మాచారం ప్ర‌కారం 30 మంది ప్ర‌యాణీకులు మ‌ర‌ణించారు.. 25 మందికి పైగా గాయ‌ప‌డ్డారు..

- Advertisement -

సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరుగగా నేటి ఉద‌యం మాత్ర‌మే ప్ర‌మాదం జ‌రిగిన విష‌యం వెలుగు చూసింది.. ఇక ప్ర‌మాద సమయంలో బస్సులో 50-55 మంది ఉన్నట్లు సమాచారం. బస్సు డ్రైవర్ పట్టు కోల్పోవడంతోనే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు ప్రమాదానికి గురైన ప్రాంతం.. వధువు ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. హరిద్వా్ర్ జిల్లాలోని లాల్ ధంగ్ నుంచి పౌడిలోని బిరోంఖల్ కు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. స్థానిక ఎమ్మెల్యే రీతూ ఖండూరి సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement