Sunday, September 8, 2024

Uttar Pradesh – పట్టాలు తప్పిన దిబ్రూగడ్ ఎక్స్ ప్రెస్ … ఇద్దరి మృతి

ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. చండీగఢ్‌ నుంచి దిబ్రూగఢ్‌కు వెళ్తున్న దిబ్రూగఢ్‌ ఎక్స్‌ప్రెస్ (15904) ఉత్తరప్రదేశ్‌లోని గోండాలోని జిలాహి రైల్వే స్టేషన్ సమీపంలో నేడు పట్టాలు తప్పింది. 10 నుంచి 12 కోచ్‌లు పట్టాలు తప్పినట్లు ప్రాథమిక స‌మాచారం .. ఈ 12 రైలు బోగీలు ట్రాక్ ప‌క్క‌కు ఒరిగిపోయాయి. ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఇద్ద‌రు మ‌ర‌ణించారు. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. . ఈ రైలు చండీగఢ్‌ నుంచి దిబ్రూగఢ్‌కు వెళ్తోంది.

విష‌యం తెలిసిన వెంట‌నే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించి స‌హ‌య కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని అధికారులను ఆదేశించారు. ప్ర‌స్తుతం సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. గోండా నుంచి ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్‌లు సహాయం కోసం స్థలానికి చేరుకున్నాయి. దీనిపై మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement