Friday, October 4, 2024

UP – ట్రక్ – ట్రాక్టర్ ఢీ: 10 మంది దుర్మరణం

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 13 మంది కూలీలతో వారణాసి వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను ట్రక్కు ఢీకొంది. .

ఈ ఘటనలో 10 మంది కూలీలు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు … 13 మంది రోజువారీ కూలీలు భదోహ జిల్లాలో పని ముగించుకొని తిరిగి వారణిసి వైపు వెళుతుండగా, నిన్న అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కచ్వా సరిహద్దు జిట్‌ రోడ్‌ లో ప్రమాదం జరిగింది.

- Advertisement -

ఓ ట్రక్కు అదుపుతప్పి ట్రాక్టర్‌ను వెనక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో 10 మంది కూలీలు అక్కడికక్కడే మరణించారు.మరో ముగ్గురు కూలీలు తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడిన కూలీలను వెంటనే బనారస్‌ హిందూ యూనివర్శిటీ ట్రామా సెంటర్‌కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement