Tuesday, September 17, 2024

UP – రాఖీ వేడుక‌ల‌లో విషాదం – రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం..

యూపీలోని బులంద్‌షహర్‌లో నేడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాఖీ వేడుకలకు వెళ్తుండగా 10 మంది మృతి చెందారు. వ్యానును బస్సు ఢీకొట్టింది. సేలంపూర్ పోలీస్ స్టేషన్‌కు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 25 మందికి పైగా గాయాలయ్యాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి సంబంధించిన ఏడుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement