Thursday, September 19, 2024

Delhi | ఖర్గేతో ఉద్ధవ్ ఠాక్రే భేటీ.. మహారాష్ట్రలో పొత్తుపై చర్చ

మహారాష్ట్ర శివసేన యూబీటీ నేత, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, కుమారుడు ఆదిత్య ఠాక్రే ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై చర్చ చర్చిస్తున్నారు. భారత కూటమిలో భాగమైన శివసేన యుబిటి పొత్తు, సీట్ల పంపకాలపై చర్చిస్తోంది.

గత లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఇండియా కూటమి మెరుగైన ఫలితాలు సాధించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే జోరు కొనసాగించాలని కూటమి భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పొత్తు, సీట్ల పంపకంపై సోనియా, రాహుల్, మల్లిఖార్జున ఖర్గేతో చర్చించనున్నారు.

అక్టోబర్‌లోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని సన్నద్ధం అవుతోంది. అలాగే ఎన్డీఏ కూటమి కూడా వ్యూహాలు రచిస్తోంది. ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో భాగమైన ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం మహారాష్ట్రలో ఒంటరిగా పోటీ చేయాలని ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement