Tuesday, September 17, 2024

Uttarakhand | టన్న‌ల్ ఆప‌రేష‌న్ స‌క్సెస్.. 41మంది సుర‌క్షితం

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు నిర్వహించిన ఆపరేషన్ విజయవంతం అయింది. నిర్మాణం దశలో ఉన్న సొరంగం ప్రమాదవశాత్తూ కూలడంతో.. భూగర్భ బందీలుగా బిక్కుబిక్కుమంటూ గడిపిన కార్మికులను రెస్క్యూ బృందాలు సురక్షితంగా కాపాడాయి.

స్ట్రెచర్ సహాయంతో ఒకరి తర్వాత మరొకరిని బయటకి తీసుకొచ్చారు. 17 రోజుల పాటు టన్నెల్‌లోనే చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా ప్రాణాలతో బయపడ్డారు. సొరంగంలో ఇరుక్కున్న 41 మంది కార్మికులు క్షేమంగా బయటికి వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement