Monday, October 7, 2024

TGSRTC | అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్..

తమిళనాడులోని అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ అధికారులు శుభవార్త చెప్పారు. గురు పౌర్ణమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తెలంగాణలోని పలు జిల్లాల నుంచి అరుణాచలం టెంపుల్‌కు ప్రక్యేక బస్సులను నడపనున్నట్లు వెల్లడించించారు.

హైదరాబాద్‌ నగరంతో పాటు ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, నల్లగొండ, వరంగల్‌, కరీంనగర్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబుబ్‌నగర్‌, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను టీజీఎస్‌ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ నెల 21న గురుపౌర్ణమి కాగా.. 19వ తేది నుంచి 22వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది.

ఈ ప్యాకేజీలో కాణిపాక వరసిద్ది వినాయక స్వామితో పాటు శ్రీపురంలోని గొల్డెన్‌ టెంపుల్‌ను సందర్శించే సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. అరుణాచల గిరి ప్రదక్షిణ ప్యాకేజీ బుకింగ్‌ కోసం http://tsrtconline.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement